Wednesday, 19 November 2025 07:12:10 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్

Date : 28 January 2025 01:51 AM Views : 1073

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / ఉత్తరప్రదేశ్ : మహా కుంభమేళాలో లిక్కర్ స్మగ్లర్.. పుణ్యస్నానం కోసం పోలీసులకు చిక్కాడు! అతడు ఒక లిక్కర్ స్మగ్లర్. కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. ఆ లిక్కర్ స్మగ్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. అతను మాత్రం మహా కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం చేశాడు. అయితే అక్కడ దొరకడంతో పోలీసులు ఆ లిక్కర్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఏడాదిన్నర క్రితం నకిలీ మద్యం తరలిస్తుండగా పట్టుబడిన ఆ స్మగ్లర్.. అప్పటి నుంచి పరారీలో ఉండగా.. ఇన్ని రోజుల తర్వాత మహా కుంభమేళాలో పట్టుబడటం గమనార్హం. లక్షల మంది భక్తులు నిత్యం స్నానం చేస్తుండగా.. అందులో ఒక 22 ఏళ్ల యువకుడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. మద్యం స్మగ్లింగ్ కేసులో ఏడాదిన్నరగా పరారీలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ స్మగ్లర్ ఎట్టకేలకు ప్రయాగ్‌రాజ్‌లో పట్టుబడ్డారు. అతడే రాజస్థాన్‌కు చెందిన ప్రవేశ్ యాదవ్. 22 ఏళ్ల ప్రవేశ్ యాద‌వ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ఏరియాలో పోలీసులు ప‌ట్టుకున్నారు. మ‌ద్యం స్మగ్లింగ్ కేసులో 2023 జూలై నుంచి ప్రవేశ్ యాదవ్ త‌ప్పించుకుని తిరుగుతున్నాడని బ‌దోయి ఎస్పీ అభిమన్యు మాంగ‌లిక్ వివ‌రించారు. రాజస్థాన్ అల్వార్ జిల్లాకు చెందిన ప్రవేశ్ యాద‌వ్‌.. 2023 జూలై 29వ తేదీన అల్వార్ నుంచి బీహార్ వెళ్లే మార్గంలో జాతీయ ర‌హ‌దారిపై.. పోలీసులు వాహ‌నాలు చెకింగ్ చేస్తున్న స‌మ‌యంలో న‌కిలీ మ‌ద్యం పట్టుబడింది. ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ కేసులో ప్రదీప్ యాద‌వ్‌, రాజ్ దొమోలియాను అరెస్టు చేశారు. అయితే ప్రవేశ్ యాద‌వ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా ప‌రారీ అయ్యాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఈ నిందితులు అంద‌రూ.. చాలా ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌కు అక్రమంగా మ‌ద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేసేందుకు వ‌చ్చిన ప్రవేశ్ యాద‌వ్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు బదోయి ఎస్పీ అభిమన్యు మాంగలిక్ వెల్లడించారు. ఐపీసీతో పాటు ఎక్సైజ్ శాఖ చ‌ట్టంలోని 419, 420, 468, 471, 272, 273, 207 సెక్షన్ల కింద ప్రవేశ్ యాదవ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వారు.. పుణ్యస్నానం కోసం ప్రయాగ్‌రాజ్ వస్తే.. చేసిన పాపాలు పండి పోలీసులకు దొరికిపోయాడు అని అంటున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :