Wednesday, 19 November 2025 07:06:01 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు

Date : 27 May 2025 12:18 PM Views : 765

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం 20 సంవత్సరాల తర్వాత కలిసిన 2004-2005 టెన్త్ క్లాస్ విద్యార్థులు...... అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం, కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004 -2005 సంవత్సరం 10వ తరగతి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo ఆదివారం కాశీపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు... చిన్ననాటి చదువు చెప్పిన ఉపాధ్యాయులును జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు హెచ్ఎం గా పని చేసిన స్వర్గీయ బాబురావు మాస్టారుకి ముందుగా మౌనం పాటించి, చదువు చెప్పిన ఉపాధ్యాయులును జ్ఞాపకం చేసుకుంటూ, ఆనందంగా గడిపారు... అనంతరం చిన్ననాటి చదువుకున్న మధుర జ్ఞాపకాలను నేమురు వేసుకుంటూ ఆత్మీయంగా, ఆనందంగా ఉల్లాసంగా,గత 20 సంవత్సరాలు క్రితం ఒకే చోట చదువుకున్న మధురు జ్ఞాపకాలను ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని జ్ఞాపకాలను అందరూ కలిసి సంతోషం వ్యక్తం చేశారు... ఇకనుండి ప్రతి సంవత్సరం అందరం ఒకే చోట కలుసుకొని, కష్ట, సుఖాలను పాలుపంచుకొని అందరం ఒకే వేదికపై ఉండి,,, ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు 2005వ సంవత్సరం విద్యార్థులు... మన విద్యార్థులులో ఎవరు చనిపోయిన, బాధలో ఉన్నా, స్కూల్ బాగుకోసంతో పాటు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటమే ఈ ఫౌండేషన్ లక్ష్యం అని విద్యార్థులు అన్నారు... ముఖ్యంగా అనారోగ్యం వచ్చిన, మరణించిన, పేదరికంలో మగ్గిపోయిన వాళ్ల కుటుంబాలకి అండగా ఉండటం కోసమే ""కాశీపురం హై స్కూల్ బాబురావు మాస్టర్ ఫౌండేషన్ ""గా నామకరణం చేశారు.. విద్యార్థులంతా ఈ ఫౌండేషన్ కి పూర్తిగా సహకారం అందించాలని అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని కొంతమంది విద్యార్థులు నడుము కట్టారు ఈ ఫౌండేషన్ ద్వారా.. విద్యార్థుల్లో ఒకరైన,విద్యార్థి భర్త చనిపోవడంతో ఆ మహిళా విద్యార్థికి ₹10,000 ఆర్థిక సహాయం చేసినట్టు విద్యార్థులు తెలిపారు.... వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే ఫౌండేషన్ ద్వారా, విద్యార్థులు మరియు ఫ్యామిలీ మొత్తం వచ్చి మరో మీటింగ్ పెట్టి అందరం కలిసి కంకణం కట్టుకోవాలి అని పూర్వ విద్యార్థులు అన్నారు..20 వసంతాలు, పూర్తయిన సందర్భంగా గట్టి నిర్ణయం తీసుకున్నారని 1997లో ఉన్న హెచ్ఎం నాయుడు మాస్టర్ కొనియాడారు

బాబురావు మాస్టర్ గారికి 2నిముషాలు మౌనo పాటిoచిన పూర్వ విద్యార్థులు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :