విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, శ్రీరాపురం గ్రామo చెక్ పోస్ట్ దగ్గర గంజాయిను పొట్టుకొన్న దేవరాపల్లి పోలీసులు ముగ్గురు యువకులు అరెస్ట్ సుమారు 25 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఎస్సై సత్యనారాయణ పల్సర్ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడిన వైనం గంజాయి ప్యాకెట్స్ అయితే అనుమానం వస్థాదని, కొత్త రూట్లో ఎంచుకొని మరి సినిమాను తలపించే విధంగా గంజాయిని మరిగించి లిక్విడ్ లాగా తయారుచేసి పట్టుకెళ్తున్నట్టు సమాచారం ముందుగానే రావటంతో వెంటనే తేరుకొని దేవరాపల్లి ఎస్సై శ్రీరాంపురం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అందులో రెండు కేజీలు గంజాయి లిక్విడ్, కేజీ హశిష్ ఆయిల్ , ఉన్నట్టు గుర్తించిన ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం రావడంతో దేవరాపల్లి ఎస్సై శ్రీరాంపురం చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ సిబ్బందితో కలిసి అనుమానం తోటి ముగ్గురు యువకులు పల్సర్ బైక్ మీద వెళుతున్నట్టు గుర్తించి చాకచౌక్యంగా పట్టుకున్నారు.. పట్టుకున్న ముగ్గురు యువకుల్ని బ్యాగులు చెక్ చేయగా రెండు కేజీలు లిక్విడ్ గంజాయి, ఒక కేజీ హసీష్ ఆయిల్ దానితోపాటు పల్సర్ బైకు మూడు సెల్ ఫోన్లు పట్టుకొని వారిని మీడియా ముందు ఉంచి అరెస్టు చేశారు దేవరాపల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది మరియు సిఐ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పట్టుబడిన యువకులు రంజాన్ మన్సారి 23 సంవత్సరాలు మహారాష్ట్ర వాసిగా, గోల్లోరి ధనీష్ డుబ్బిరిగూడేo మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మరో యువకుడు అదే మండలానికి చెందిన పాంగి దేవదాసుగా గుర్తించారు వాళ్ల దగ్గర ఉన్న బైకు, మూడు సెల్ ఫోన్లు,3000రూ నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు ఈ కేసులో నార్కోటికి డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స్టన్స్ యాక్ట్ 1985, (నూప్స్ యాక్ట్ ) లోని సెక్షన్లు కింద కేసు నమోదు చేసి ముద్దాయిలని న్యాయం స్థానానికి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు చోడవరంలో హాజరు పరుస్తామని మీడియా సమావేశంలో చెప్పారు
Admin
Viswas Tv