Tuesday, 15 September 2026 05:25:58 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

కేసీఆర్ సమక్షంలో BRS తిర్ధo పుచ్చుకున్న ఏపీ నేతలు, సంక్రాంత్రి తరువాత వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాసం!

Date : 02 January 2023 09:33 PM Views : 861

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : విశ్వాస్ టీవీ : హైదరాబాద్ :ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో(BRS) చేరారు. మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి సహా టీజే ప్రకాశ్, తాడివాక ర‌మేశ్ నాయుడు, గిద్దల శ్రీనివాస్ నాయుడు, జెటి రామారావు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఏ ప్రాంతం కోసమో, ఏ వర్గం కోసమే ఏర్పడలేదని.. ఇది దేశం కోసం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. లక్ష అడుగుల ప్రయాణమైనా.. ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో అందరికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయని.. బీఆర్ఎస్ ఎందుకు ఏర్పడిందనే దానిపై సవివరంగా చెబుతామని తెలిపారు. అసలు ఇప్పుడు దేశం దిశ ఏమిటనేది ఎవరికి తెలియదని కేసీఆర్ అన్నారు. ఏం చేసి అయినా ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా దేశంలోని రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. అలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవస్థీకృతమైన విధానం రావాలని.. దాని కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే.. దేశంలోని 40 కోట్ల ఎకరాల భూమి పండించడం సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందే ఇక్కడ కూడా కరెంట్ కష్టాలు ఉన్నాయని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు పోవాలని.. అందుకే బీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. దేశంలో పరిస్థితులు మారాలన్న కేసీఆర్.. ఏపీలో పార్టీ విస్తరణకు ఏ విధంగా ముందుకు వెళతారు ? ఏపీతో తెలంగాణకు ఉన్న సమస్యల విషయంలో ఏ విధమైన ధోరణి అవలంభిస్తారనే అంశాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :