Wednesday, 19 November 2025 08:44:30 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

కేసీఆర్ సమక్షంలో BRS తిర్ధo పుచ్చుకున్న ఏపీ నేతలు, సంక్రాంత్రి తరువాత వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాసం!

Date : 02 January 2023 09:33 PM Views : 655

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : విశ్వాస్ టీవీ : హైదరాబాద్ :ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో(BRS) చేరారు. మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి సహా టీజే ప్రకాశ్, తాడివాక ర‌మేశ్ నాయుడు, గిద్దల శ్రీనివాస్ నాయుడు, జెటి రామారావు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఏ ప్రాంతం కోసమో, ఏ వర్గం కోసమే ఏర్పడలేదని.. ఇది దేశం కోసం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. లక్ష అడుగుల ప్రయాణమైనా.. ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో అందరికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయని.. బీఆర్ఎస్ ఎందుకు ఏర్పడిందనే దానిపై సవివరంగా చెబుతామని తెలిపారు. అసలు ఇప్పుడు దేశం దిశ ఏమిటనేది ఎవరికి తెలియదని కేసీఆర్ అన్నారు. ఏం చేసి అయినా ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా దేశంలోని రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. అలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవస్థీకృతమైన విధానం రావాలని.. దాని కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే.. దేశంలోని 40 కోట్ల ఎకరాల భూమి పండించడం సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందే ఇక్కడ కూడా కరెంట్ కష్టాలు ఉన్నాయని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు పోవాలని.. అందుకే బీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. దేశంలో పరిస్థితులు మారాలన్న కేసీఆర్.. ఏపీలో పార్టీ విస్తరణకు ఏ విధంగా ముందుకు వెళతారు ? ఏపీతో తెలంగాణకు ఉన్న సమస్యల విషయంలో ఏ విధమైన ధోరణి అవలంభిస్తారనే అంశాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :