Wednesday, 19 November 2025 07:06:52 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి

Date : 24 August 2023 04:35 PM Views : 3321

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదిలే రైలులో ఒక తల్లిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం. బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదిలే రైలులో ఒక తల్లిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం. జనం న్యూస్: నడి రోడ్డుపై తాగేసి తన మానాన తాను ఇంటికి వెళుతున్న మహిళపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి పైశాచికం ఆనందం పొందేవాడు ఒకడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై, చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టే కామాంధుడు మరొకరు. బహిర్భూమికి వెళ్లినా, పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్న కామ పిశాచాలు కొందరు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల వెకిలి చేష్టలు చేసేవారు మరికొందరు. సమాజం ఎటు పోతుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ? ఆడదానిగా పుట్టడమే ఆమె చేసిన పాపమా,శాపమా? పసిగొడ్డు దగ్గర నుండి కాటికి కాలు చాపే వృద్ధురాలి వరకు కామోన్మాదులు బరితెగింపు చర్యలకు దిగుతున్నారు. జనాలు చూస్తున్నారన్న ఆలోచన కూడా లేదు నిస్సిగ్గుగా తప్పులు చేస్తున్నారు. తాజాగా యావత్ దేశం తలదించుకునే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోనే అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు దుర్మార్గులు. ఈ ఘటన అస్సాం నుండి పశ్చిమ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైల్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గౌహతికి చెందిన మహిళ తన కుమారుడితో కలిసి బెంగాల్‌లోని అలీపూర్‌ద్దార్ వెళ్లేందుకు సిఫాంగ్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్ చేరుకునే దాదాపు అందరూ దిగిపోయారు ఈ క్రమంలో ఆ బోగీలో ఒంటరిగా ఉండిపోయింది మహిళ. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు.. బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమె దగ్గరకు వెళ్లి.. మహిళను గట్టిగా పట్టుకుని కట్టేశారు. ఆపై దాడి చేశారు. బిడ్డను తీసుకుని తమకు సహకరించాలని లేకుంటే బాబును పడేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆమె తలొంచాల్సి వచ్చింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. రైతు గమ్యస్థానానికి చేరుకోగానే.. బాధితురాలు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన మొత్తాన్ని వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల్ని పట్టుకున్నారు. అస్సాంకు చెందిన అబ్దు, మొయినుల్ హక్ ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని కోర్టులో హాజరు పరిచారు. గతంలో కూడా ఓ రైల్వే టీటీ.. కదులుతున్న రైలులో మహిళా ప్రయాణీకురాలిపై అత్యాచారానికి తెగబడిన సంగతి విదితమే.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :