విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బాలానగర్ నుండి కూకట్ పల్లి వై జంక్షన్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ చెందిన బస్సు లో ఒకసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్. పి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న బస్సులు ఒక్కసారిగా ఇంజన్ నుండి భారీ శబ్దంతో మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది, ఈ ప్రమాదంలో పూర్తి గా బస్సు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళన తో పరుగులు తీశారు వాహన దారులు. ప్రమాదం కారణంగా బాలానగర్ నుండి వచ్చే వాహనాలు నిలిచిపోవడం తో భారీ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.
Admin
Viswas Tv