Thursday, 30 July 2026 08:52:05 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఏపీలో ముందుస్తు ఎన్నికలు పై స్పందిoచిన మంత్రి పెద్ది రెడ్డి.... !

Date : 05 June 2023 05:07 PM Views : 1185

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీలో కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్లకు వరుసగా వెళ్తుండటం, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు, టీడీపీ మ్యానిఫెస్టో విడుదల నేపథ్యంలో ఈ రూమర్లు మరింత పెరిగాయి. దీనిపై ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు దూకుడుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల ఊహాగానాలన్ని ఆయన ఖండించారు. తాము పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్తామన్నారు. ఇప్పటికే కేంద్రం ఓవైపు జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తుండటం, ఏపీలోనూ ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నాడన్నారు. చంద్రబాబు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని ఆరోపించారు. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీకి దిగుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి తానేం మాట్లాడనంటూ మీడియాను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు స్పష్టంగానే ఉన్నా రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడితో దీనిపై నమ్మకం కుదరడం లేదు. ముఖ్యంగా కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుందన్న ప్రచారంతో ముందస్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: