Wednesday, 19 November 2025 08:44:28 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

ఉక్కు ప్రజా గర్జన ఈనెల 30 న జయప్రదం చేయండి సీఐటీయు పిలుపు

Date : 22 January 2023 05:41 PM Views : 806

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఉక్కు ప్రజాగర్జనను జయప్రదం చేయండి ఉక్కు ఉద్యమాన్ని రెండవ దశలోకి తీసుకువెళ్లడంలో భాగంగా జనవరి 30వ తారీకు జరుగుతున్న ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయండి అని స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటిదాస్ పిలుపునిచ్చారు. నేడు ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించిందని ఈ సమస్యపై ఐక్యతను రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికే ఉక్కు ప్రజా గర్జనలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఉన్న పార్టీలకు వివిధ ఎజెండాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడం ద్వారానే ఉందన్న సత్యాన్ని వివిధ పార్టీల ప్రతినిధులు ఒప్పుకుంటున్నారని ఆయన వివరించారు. అందులో భాగంగానే ఈనెల 23 వ తారీఖున గాజువాక లో ఉన్న 21 మంది కార్పొరేటర్లతో వెస్ట్ రామచంద్ర హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దీనిలో స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటున్నారని దీన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలపై ఈ పోరాటం ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. కనుక ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉక్కు ప్రజా గర్జనను ప్రతి ఒక్కరూ జయప్రదం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు బి అప్పారావు, పి శ్రీనివాసరాజు, గంగాధర్, యు వెంకటేశ్వర్లు, మరిడయ్య, నీలకంఠం, కృష్ణమూర్తి, పుల్లారావు, శశి రెడ్డి, ఉమామహేశ్వరరావు, ఆర్ రాజేశ్వరరావు, బిఎన్ మధుసూదన్, మొహిద్దిన్, సూర్యనారాయణ, కె బాలశౌరి, కె సత్యనారాయణ తదితరులతో పాటు వివిధ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :