Friday, 16 January 2026 03:56:37 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

గుంటూరు జిల్లా కి చెందిన,19 ఏళ్ళ కుర్రాడు రహిద్, 20 లక్షలకు కొన్న, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కి చెందిన యువ క్రికెటర్ షేక్ రహిద్ ఐపీఎల్ లో ఎంట్రీ...

Date : 24 December 2022 08:09 PM Views : 773

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా :

విశాఖపట్నం విశ్వాస్ టీవీ IPL Auction 2023: నిన్న (డిసెంబర్ 23) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఇందులో కొంతమంది అంతర్జాతీయ ఆటగాళ్లు కోట్లు పలికారు. అలాగే దేశావాళీలో రాణించిన కుర్రాళ్లను కొన్ని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఉన్నాడు. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక రహీద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం జరిగిన మినీ వేలంలో ఇతడిని సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2022 లో రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ లీగ్ లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్ 159 పరుగులు చేశాడు. అలాగే 2022లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న యువ జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అప్పుడే రషీద్ ఐపీఎల్ కు వస్తాడని భావించినా.. కొన్ని కారణాల వల్ల అతడితో పాటు పలువురు అండర్- 19 ఆటగాళ్లు ఈ లీగ్ లోకి రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం రషీద్ న చెన్నై దక్కించుకుంది. ఏకంగా భారత మాజీ కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్ ఆడబోతున్నాడు రషీద్. దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఈ యువ క్రికెటర్ కెరీర్ కు కచ్చితంగా దోహదపడుతుంది. రషీద్ గురించి మరికొంత 18 ఏళ్ల రషీద్ తొమ్మిదేళ్లకో అండర్ - 14 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అండర్- 19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో 50 పరుగులు చేశాడు. జట్టు కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం ఆ టోర్నీలో 201 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ రషీద్ అరంగేట్రం చేశాడు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :