Wednesday, 19 November 2025 08:44:29 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

లారస్ ల్యాబ్ లో నలుగురు మృతి ఒకరికి ఆరోగ్యo విషమo........

Date : 28 December 2022 12:25 AM Views : 803

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ ఫార్మాసిటీలో  సోమవారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా  ఉంది.పరవాడ ఫార్మాసిటీలోని  లారస్  యూనిట్ -3 లో  షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.  ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు కార్మికులు  గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి  పరిస్థితి  విషమంగా  ఉందని వైద్యులు  ప్రకటించారు.  ఈ ప్రమాదంలో  మృతి చెందిన  కార్మికుల మృతదేహలను  కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఖమ్మం జిల్లాకు చెందిన  బి. రాంబాబు, గుంటూరు జిల్లాకు రాజేష్ బాబు , రంగారెడ్డి జిల్లాకు సతీష్ , కోటపాడుకు చెందిన రామకృష్ణ,చోడవరం మండలానికి చెందిన వెంకటరావులు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వారిని  ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు మృతి చెందారు. మరొకరు  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.    

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :