Wednesday, 19 November 2025 07:04:49 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

అబ్బో మోదీ..... అప్పుడు చంద్రబాబు,ఇప్పుడు జగన్... బీజేపీ ఒక డర్టీ పోలిటీక్స్ చేస్తుంది......

ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలా ఓ విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంటుంది. గతంలో 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం.

Date : 12 June 2023 07:42 PM Views : 3283

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలా ఓ విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంటుంది. గతంలో 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం పేరుతో బీజేపీ ఏపీలో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది ఈ క్రమంలో అధికార పార్టీల్ని అవినీతి పేరుతో టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ఈసారి కూడా 2024 ఎన్నికలకు ముందే అధికార వైసీపీని అదే పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది.

తాజాగా శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రంలో కీలకంగా ఉన్న హోమంత్రి అమిత్ షా విశాఖలో తాజాగా పర్యటించారు. ఈ రెండు సభల్లోనూ నడ్డా, అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. దాని కంటే స్ధానికంగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను టార్గెట్ చేసేందుకు ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా వైసీపీ అవినీతి తమకు ఇప్పుడే గుర్తుకొచ్చిందనేలా విమర్శలు చేశారు.

గతంలో చంద్రబాబుతో మూడున్నరేళ్లు కాపురం చేసిన బీజేపీ.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తమతో విభేదించారన్న కారణంతో ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో ఆర్ధిక వెసులుబాటు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఓవైపు రాజకీయ విమర్శలు చేస్తూనే మరోవైపు ఆర్ధికంగానూ చంద్రబాబు టీడీపీని దిగ్బంధించింది. దీంతో 2019 ఎన్నికల్లో చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లకు టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు వైఎస్ జగన్ పైనా ముందుగా అవినీతి పేరుతో బీజేపీ కీలక నేతలు నడ్డా, అమిత్ షా విమర్శలకు దిగడంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగేళ్లుగా దూరంగా ఉంచిన చంద్రబాబును ఢిల్లీకి రప్పించుకుని చర్చించిన అమిత్ షా .. విశాఖలో జగన్ సర్కార్ పై చేసిన విమర్శలు చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి ఏం జరగబోతోందో ఇట్టే అర్ధమవుతుంది. దీంతో బీజేపీ రాజకీయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ఇవ్వాల్సిన విభజన హామీల్ని నెరవేర్చకుండా రాష్ట్రంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని అవినీతి పేరుతో టార్గెట్ చేయడం ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :