Thursday, 30 July 2026 07:50:05 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

Blue : బ్లూ కలర్ లో శరీరం మార్పు రావటానికి సంచలన విషయాలు బయట పెట్టిన డాక్టర్స్.....

Date : 28 January 2023 07:56 AM Views : 1022

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్లు తిరిగి కిందపడిపోవడం, ఆస్పత్రి పాలవ్వడం జరిగాయి. అయితే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు.. స్టంట్ వేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు.. తారకరత్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే సమయానికి అతని శరీరం బ్లూ కలర్ లోకి మారినట్లుగా వార్తలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో తారకరత్న శరీరం ఎందుకు బ్లూకలర్ లోకి మారిందన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ విషయంపై.. ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ స్పందిస్తూ తారకరత్న శరీరం ఎందుకు బ్లూకలర్ లోకి మారిందన్న దానిపై వివరణ ఇచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు మొదట స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం పీఎస్‌ఈ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పీఎస్‌ఈ వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ లు ఉన్నట్లు తెలిపారు. అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిన వైద్యులు.. ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో పల్స్‌ లేవని.. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారిందని వెల్లడించారు. వెంటనే చికిత్స అందించామని.. సుమారు 45 నిమిషాల వరకు పల్స్‌ అందలేదని.. ఆ తర్వాతే పల్స్‌ మొదలైందని తెలిపారు.

తారకరత్న శరీరం నీలంగా మారడానికి కారణం.. అతని రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడమే అని డాక్టర్ చెప్పుకొచ్చారు. ‘మనిషి శరీరంలో ఏయే అవయాలకు రక్తం అందకుండా ఉంటుందో ఆ అవయవాల చివరన అనగా.. చేతి వేళ్లు చివరన, కాలి వేళ్లు చివరన నీలం రంగులోకి మారతాయి. ఇప్పుడు తారకరత్న విషయంలో కూడా అదే జరిగింది. అతడి శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగలేదు.ఆ కారణంగానే బ్లూ కలర్ లోకి మారిందని..’ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తారకరత్న శరీరం నీలంగా మారడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: