విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ప్రాణాలు అర్పించి అయినా ఉక్కు ని కాపాడుకుంటాం.... ఉక్కు తెలుగువాడి ఆత్మ గౌరవం.. 32 మంది ప్రాణత్యాగాలు మరిచిపోకూడదు...విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో నే కొనసాగించాలి .... టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం రిలే నిరాహార దీక్ష లో సతీసమేతం గా పాల్గొన్న కార్పొరేటర్ బోండా జగన్నాధం, శ్రీమతి లక్ష్మి, ఉక్కు ప్రజా గర్జన తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకి కనువిప్పు కలగాలి..ఉక్కు కర్మాగారం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉక్కు ప్రయివేటికరణ కి వ్యతిరేకం జరుగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్ష శిబిరం లో 717 రోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,87 వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్ ) పాల్గొని ఉక్కు ప్రజా గర్జన కి మద్దత్తు గా దీక్ష చేసారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలు అర్పించి ఏర్పడిన ఉక్కు కర్మాగారన్ని ప్రాణాలు అర్పించి అయినా కాపాడుకోవాలన్నారు. ఈ ఉద్యమం లో అందరు కలిసి పోరాడాలని సూచించారు. ఇన్ని రోజులు గా ఉద్యమం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు స్పందించకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. నిర్వసితులు భూములు త్యాగ ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం అటువంటి నిర్వసితులు కి అన్యాయం చేసి ఉక్కు ని అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వానికి, సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. ప్రాణాలు అర్పించి అయినా ఉక్కు కర్మాగారం కాపాడుకోవటానికి పోరాటం చేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,87 వార్డు బోండా జగన్నాధం అన్నారు. ఆదివారం దీక్ష శిబిరం లో ఆయన భార్య లక్ష్మి తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని నిర్వశితుడుగా ఉన్న నేను ఉక్కు కోసం ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం గా ఉన్నాని అన్నారు. ఈ నెల 30 వ తేదీన జరిగే ఉక్కు గర్జన కవిజవంతం అవ్వాలని ఈ దీక్ష చేపట్టానని అన్నారు.తెలుగు వాడి ఆత్మ గౌరవం మన ఉక్కు కర్మాగారమని అన్నారు.నిర్వసితులు కి శాశ్వతం గా ఉపాధి కల్పించాలని విశాఖ ఉక్కు మన హక్కు అని ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకతితంగా ఉదృతం చేసి అయినా ఉక్కు కర్మాగారం కాపాడాలన్నారు. విశాఖ జిల్లా ఉక్కు కర్మాగారం వల్లే ఎంతో అభివృద్ధి చెందింది అని అటువంటి కర్మాగారన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నారు. దీక్ష కి మద్దతుగా విశాఖ జిల్లా టీడీపీ నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్లు పీలా శ్రీనివాస్,గంధం శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్,మొల్లి ముత్యాలు నాయుడు, టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కే. ఎస్. యన్ రావు, రామస్వామి,అయోధ్యరామ్, వీళ్ళ రామ్మోహనరావు, డీ.వీ. ఆర్, స్థానిక నాయకులు విజయరామరాజు, రాజన్ రాజు, కన్నారావు, రాంబాబు, అప్పలనాయుడు, కళ్లేపల్లి శ్రీనివాస్, టీడీపీ మహిళలు, నిర్వసితుల యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Viswas Tv