విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఉత్తరాంధ్ర సమస్యలు, ఈ ప్రాంత ప్రజలు ఆకాoక్షల పై,ప్రజలు పడుతున్న సమస్యలు పై, ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యoలో, మేధావి వర్గాలు, ప్రధాన రాజకీయ పార్టీ లతో చర్చావేదిక ఏర్పాటు చేయటం జరిగింది అని చర్చావేదిక కో, కన్వీనర్ బీశెట్టి బాబ్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు జనవరి 7 శనివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1. గoట వరుకు విశాఖపట్నం లోని దస్పల్లా హోటల్ 'నిర్వ హిస్తున్నట్టు అయిన వివరించారు. ఈ సదస్సుకు అధికార వైస్సార్సీపీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలను, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మేధావులను అహ్వానిoచినట్టు అయిన ప్రకటించారు. ఇప్పటి వరుకు తెలుగుదేశం, జనసేన, లోకసత్తా కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం పార్టీలు ఈ సదస్సులో పాల్గొంటామని ఆమోదం తెలిపారని బీశెట్టి బాబ్జి వివరించారు ఈ సదస్సులో ముఖ్య అతిధులుగా లోకసత్తా వ్యవస్థాపకలు డాక్టర్. జయప్రకాశ్ నారాయణ్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సబ్యలు అయ్యన్నపాత్రడు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేoడ్ల మనోహర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్యక్షలు గిడుగు రుద్రరాజు, మాజీ వైస్ ఛాన్సలర్, ఉత్తరాంధ్ర సిద్ధాంత కర్త ప్రో. కె. ఎస్. చలం తదితరులు పోల్గoటారని అయిన వివరించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర అభివృద్దిని ఆకాoక్షిoచే ప్రతి ఒక్కరూ హాజరుకావాలని వారు కోరారు.....
Admin
Viswas Tv