విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : **బిజెపి నాయకులకు సిగ్గు లజ్జా లేదా అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి లు అన్నారు* విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తూ ఎటువంటి సిగ్గు లేకుండా ఈ విశాఖ నగరంలో బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాకకు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో **ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్** ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అన్యాయంగా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఎ మొహం పెట్టుకొని బిజెపి నాయకులు ఈ నగరంలో బహిరంగ సభ నిర్వహించారు అని ప్రశ్నిస్తున్నాం లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టి సిగ్గు లజ్జా లేకుండా నగరానికి రావడం ఆ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు కనీసం స్థానిక బిజెపి నాయకులకు కూడా జవాబుదారితనం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా పరిపాలించినప్పటికీ కూడా ఇటువంటి దౌర్భాగ్యపు పనులకు పాల్పడలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారని రామారావు చెప్పారు అరెస్ట్ అయినవారిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొంపా గోవింద్ , విజయనగరం డీసీసీ అధ్యక్షుడు రమేష్, సుధాకర్ ,సయ్యద్ అభిదా, సాఫి, శిరీష్, నాగభూషణం, సరోజా, శివ , సతీష్ , తదితరులు ఉన్నారు.
Admin
Viswas Tv