Saturday, 13 June 2026 10:11:02 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

నీకు ఒక నమస్కారం చంద్రబాబు - బస్సు దిగి వెళ్లిపోయిన బండారు సత్యనారాయణ మూర్తి

Date : 15 April 2024 10:37 PM Views : 2253

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : చంద్రబాబు కి తల పగిలిపోతుంది అంటా.. ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతోంది. ప్రధాన పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల్లోని కొందరు ముఖ్య నేతలకు సీట్లు దక్కలేదు. వారంతా ఆగ్రహం తో ఉన్నారు. కొందరు పార్టీలు వీడారు. టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు ఆశించారు. ఆ సీటు జనసేనకు కేటాయించారు. తాజాగా విశాఖ వచ్చిన చంద్రబాబును బండారు కలిసారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు వైరల్ అవుతున్నాయి.

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యానారాయణ కు సీటు దక్కలేదు. పార్టీలో విశాఖ జిల్లాలో సీనియర్ గా ఉన్న బండారు పెందుర్తి సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. ఆ సీటు పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ది పంచకర్ల రమేష్ బాబుకు కేటాయించారు. బండారు తనకు సీట రాకపోవటం పైన మనస్థాపానికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితం పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగింది. కానీ, తాను పార్టీ వీడటం లేదని బండారు స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో జనసేన అభ్యర్దికి మద్దతుగా ప్రచారం చేయటం లేదు. దీంతో, తాజాగా విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో బండారు సమావేశమయ్యారు. విశాఖ పార్టీ నేతల సమక్షంలోనే బండారు తనకు సీటు ఇవ్వకపోవటం పైన బండారు ఆవేదన వ్యక్తం చేసారు.

ఆ సమయంలో బండారుకు వీలైతే మాడుగుల ఇచ్చే అంశం పైనా చర్చ జరిగింది. అయితే, తాను మాడుగుల నుంచి పోటీకి సిద్దంగా లేనని బండారు తేల్చి చెప్పారు. పెందుర్తి సీటు తొలి నుంచి టీడీపీకి కంచుకోట గా ఉందని..ఆ సీటు ఏకపక్షంగా జనసేనకు ఎలా కేటాయించటంతో కేడర్ ఆవేదన చెందుతోందని బండారు చెప్పినట్లు సమాచారం. తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించటం.. ప్రచారంలో పాల్గొనకపోవటం పైన బండారు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..బండారు సత్యనారాయణ ఆవేదన చెందారు. చంద్రబాబుకు నమస్కారం పెట్టి బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడు బండారు సత్యనారాయణ తన మద్దతు దారులతో సమావేశం కానున్నారని సమాచారం. దీంతో..బండారు తదుపరి నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :