విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : Taraka Ratna: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రను నిన్న ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఈ పాదయాత్రను చేయాలనుకున్న లోకేష్ నిన్న పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఉదయం 11 గంటల మూడు నిమిషాలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాగా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయనతో పాటు నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. ఎవరు ఊహించని విధంగా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది.తారక రత్న అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి.. బెంగళూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే మంచిదని వైద్యులు కూడా అదే విషయం చెప్పారని బాలకృష్ణ తెలిపారు. అయితే పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్న సడన్ గా ఆయన పరిస్థితి విషమంగా ఎందుకు మారిందని.. దీని వెనుక ఏదో కుట్ర జరిగిందని తారక రత్న ఫ్యాన్స్ వాదన.
తారకరత్న స్పృహ తప్పలేదని ఆయన పై విష ప్రయోగం జరిగిందని చెప్పుకొస్తున్నారు టిడిపి నేతలు. దీనికి కారణం ఆయన శరీరం నీలం రంగులో కి మారడమే కారణమని తెలుస్తోంది. యువగళం యాత్ర ప్రారంభించే ముందు తీర్థప్రసాదాలు తారకరత్న తీసుకున్నారని.. ఆ కారణంగానే తారకరత్న పల్స్ పడిపోయిందని.. ఆయన కండిషన్ క్రిటికల్ గా మారిందని.. సుమారు 45 నిమిషాల పాటు ఆయనకు పల్స్ అందలేదని.. కాగా ఆయనను యధావిధిస్థితికి తీసుకోరాడానికి.. డాక్టర్ చాలా కష్టపడ్డారని సమాచారం. నిజానికి షెడ్యూల్ ప్రకారం తారకరత్న ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు.. 48 గంటలు ముందే ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగడం ఏపీ పాలిటిక్స్ లోనే సంచలనంగా మారింది. అయితే ఆయనంటే గిట్టని వాళ్ళు కొందరు ఇలా ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే లోకేష్ యాత్ర ప్రారంభించిన రోజే ఇలా తారకరత్న పై విషప్రయోగం జరగడం ఏపీ రాజకీయాల్లోని సంచలనంగా మారింది. తారకరత్న పై ఎవరో దగ్గర వాళ్ళే ఇలా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరి విష ప్రయోగం చేశారన్నది టిడిపి తమ్ముళ్ల వాదన దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తారక రత్న త్వరగా కోలుకోవాలని అందరూ దేవుడిని ప్రార్ధిస్తున్నారు.
Admin
Viswas Tv