విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ. .... 1బి ఇవ్వడానికి 20,000 లంచం డిమాండ్. కే.కోటపాడు, సెప్టెంబర్ 08 విశ్వాస్ టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా, కే.కోటపాడు మండలం వారాడ వీఆర్వో గా పని చేస్తున్న గిడుతూరి సూర్యనారాయణ భూ యజమాని బండారు నాయుడు నుండి లంచం తీసుకుంటుండగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు విశాఖ అడిషనల్ ఎస్పీ హర్షిత, ఏసీబీ డీఎస్పీ బి వి ఎస్ ఎస్ రమణమూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వారాడ పంచాయతీ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన భూ బాధితులు బండారు నాయుడు ఐదు సెంట్లు భూమి1బికోసం గత కొంతకాలంగా విఆర్ఓ గిడుతూరి సూర్యనారాయణ చుట్టూ తిరుగుతున్నాడు. 20,000 రూపాయలు లంచం ఇస్తే గాని పని జరగదని విఆర్వో కరాకండిగా చెప్పాడు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక, దాంతో బాధితుడు నాయుడు చేసేది ఏమీ లేక రెండు రోజుల క్రితం ఏసీబీ ని ఆశ్రయించాడని చెప్పారు. పథకం ప్రకారమే మంగళవారం మధ్యాహ్నం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోనే భూ బాధితుడు నాయుడు 20,000 లంచం ఇస్తుండగా వీఆర్వో సూర్యనారాయణ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా 2022లో నాతవరం మండలం లో కూడా ఇదే విధంగా లంచం తీసుకుంటూ ఇప్పుడున్న ఏసీబీ డిఎస్పి రమణమూర్తి చేతికే చిక్కారని ఈ సందర్భంగా రానుమూర్తి గుర్తు చేశారు. వీఆర్వోని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడం కూడా మహా నేరం, ఎవరైనా లంచం అడిగినట్లయితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయవలసిందిగా కోరారు. ఈయన వెంట ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుప్రియ, వెంకట్రావు ,లక్ష్మణరావు, సురేష్, తదితర సిబ్బంది ఉన్నారు.
Admin
Viswas Tv